ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను మార్చి 9, 2026న ప్రచురించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ జాబితాల ఆధారంగానే భవిష్యత్తులో చైర్పర్సన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఈ జాబితాలను రూపొందిస్తున్నారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు ఈ జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలను పర్యవేక్షిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Advertisement
Advertisement