Advertisement

Thalliki Vandanam 2026: అర్హుల జాబితా విడుదల.. కీలక తేదీలు ఇవే!

Join Telegram
Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హుల జాబితాను మరియు నిధుల జమ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు (SGSW) శాఖ ద్వారా ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, టైమ్‌లైన్స్ ఇక్కడ పరిశీలించండి.

తల్లికి వందనం 2026 – సమయ పరిమితి (Timelines)

మొదటి విడతలో మొత్తం 64,76,590 మంది అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు. పూర్తి షెడ్యూల్ కింది పట్టికలో ఉంది:

క్రమ సంఖ్యవివరాలు (Task)గడువు తేదీ (Timeline)
1మొదటి విడత ఆర్థిక సాయం జమ22 జులై 2026
2సచివాలయాల్లో అర్హుల/అనర్హుల జాబితాల ప్రదర్శన21 జులై 2026
3ఆన్‌లైన్ అభ్యంతరాలు / ఫిర్యాదుల స్వీకరణ (Grievances)22 జులై – 03 ఆగస్టు 2026
4ఫిర్యాదుల పరిశీలన & సవరించిన జాబితా రూపకల్పన04 ఆగస్టు – 10 ఆగస్టు 2026
51వ తరగతి & ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొత్త అడ్మిషన్ల గడువు25 ఆగస్టు 2026
6అనుబంధ అర్హుల జాబితా (Supplementary List) ప్రదర్శన30 ఆగస్టు 2026
7అదనంగా ఎంపికైన వారికి నిధుల జమ (2nd Phase)30 ఆగస్టు 2026

జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి? (Grievance Redressal)

అనర్హుల జాబితాలో పేరు ఉన్నా లేదా లిస్ట్ లో పేరు కనపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆగస్టు 3, 2026 లోపు మీ స్థానిక స్వర్ణ గ్రామం / వార్డు (SGSW) కార్యాలయానికి (పాత సచివాలయం) వెళ్లి అభ్యంతరం సమర్పించవచ్చు.

కావాల్సిన పత్రాలు:

  • రేషన్ కార్డ్ (Ration Card) కాపీ
  • తల్లి మరియు విద్యార్థి ఆధార్ కార్డ్ (Aadhaar Card)
  • బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ (ఆధార్/NPCI లింక్ అయి ఉండాలి)
  • స్కూల్/కాలేజీ ఐడీ కార్డ్ లేదా అడ్మిషన్ రసీదు

సచివాలయ సిబ్బంది మీ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత ఆగస్టు 30న మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.

Advertisement